హైదరాబాద్, ఏప్రిల్11 (నమస్తే తెలంగాణ): మైనారిటీ గురుకులాల్లో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని క్యాటగిరీల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఏప్రిల్ 20 వరకు పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ సెక్రటరీ షఫియుల్లా సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అర్హులైన విద్యార్థులు tmreis.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని, ఇతర వివరాలకు 040–23437909 నంబర్లో సంప్రదించాలని సూచించారు.