ఎస్ఐ- 452 ఖాళీలు కానిస్టేబుల్- 4,208 పోస్టులు రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు: 4660. వీటిలో ఎస్ఐ- 452, కానిస్టేబుల్- 4208 ఖాళీలు ఉన్నాయి. పోస్టులు: సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ అర్హతలు: సబ్ ఇన్స్పెక్టర్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. వయస్సు: 2024, జూలై 1 నాటికి 20- 28 ఏండ్ల మధ్య ఉండాలి. కానిస్టేబుల్: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. వయస్సు: 2024, జూలై 1 నాటికి 18- 28 ఏండ్ల మధ్య ఉండాలి. నోట్: రెండు పోస్టులకు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ) ద్వారా ముఖ్యతేదీలు దరఖాస్తు: ఆన్లైన్లో ఏప్రిల్ 15 నుంచి చివరితేదీ: మే 14 వెబ్సైట్: https://rrbsecunderabad.gov.in నోట్: పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ను త్వరలో ఆర్ఆర్బీ విడుదల చేయనున్నది.