బాలీవుడ్ అగ్ర దర్శకనిర్మాత సంజయ్లీలాభన్సాలీ ‘హీరా మండీ’ పేరుతో ఓ వెబ్సిరీస్ను రూపొందించబోతున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్పై ఆయన నిర్మించబోతున్న తొలి సిరీస్ ఇదే కావడం విశేషం. ఈ సిరీస్ కథాంశం 1800 శతాబ్దం చివరి నుంచి ఆరంభమై 1950 దశకం వరకు సాగుతుందని సమాచారం. ఈ సిరీస్లో బాలీవుడ్ నాయిక సోనాక్షిసిన్హా వేశ్యగా ప్రధాన పాత్రలో నటించనుంది. బ్రిటీష్ పరిపాలనలో చోటుచేసుకున్న కొన్ని చారిత్రక ఘటనల ఆధారంగా ఈ సిరీస్ను తెరకెక్కించబోతున్నారు. తొలిసీజన్లో ఎనిమిది ఎపిసోడ్స్కు సన్నాహాలు చేస్తున్నారు. చారిత్రక పాత్ర కావడంతో ఈ సినిమాపై సోనాక్షిసిన్హా ప్రత్యేక దృష్టి పెట్టిందని..సంప్రదాయ నృత్యాల్లో శిక్షణ తీసుకుంటున్నదని తెలిసింది. నెగెటివ్షేడ్స్లో సోనాక్షిసిన్హా పాత్ర సాగనుంది.