భూపాలపల్లి టౌన్, ఫిబ్రవరి 22 : జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి గవర్నమెంట్ హాస్పిటల్లో పురుడు పోసుకొని ఆదర్శంగా నిలిచారు. మంగళవారం ఉదయం ఆమె ప్రసవం కోసం భూపాలపల్లిలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో చపండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.
హాస్పిటల్ సూపరిండెంట్ తిరుపతి, గైనకాలజిస్టులు కట్ట శ్రీదేవి, కట్ట లావణ్య, అనస్తీషియా డాక్టర్ శ్రీకాంత్ శ్రీహర్షిణికి కేసీఆర్ కిట్ అందజేశారు. సర్కారీ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలనే తాను ప్రసవం కోసం ప్రభుత్వ దవాఖానకు వచ్చానని హర్షిణి తెలిపారు.
నాడు సర్కారు దవాఖాన అంటే భయపడేవారని, సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో కార్పొరేట్కు దీటుగా వైద్యం అందడం వల్ల క్యూ కడుతున్నారని చెప్పారు. అందరూ సర్కారీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.