భైంసా, ఫిబ్రవరి 8 : కుంటాల మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులను పారదర్శకంగా నిర్వహించాలని నిర్మల్ జడ్పీసీఈవో సుధీర్ కుమార్ అన్నారు. కుంటాల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో బుధవారం ఆయా శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో దేవేందర్ రెడ్డి, ఎంపీవో అబ్దుల్ రహీం, ఏపీవో నవీన్, ఏపీఎం భోజన్న, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులపై సమావేశం..
మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో జడ్పీ సీఈవో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఇప్పటికే తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతివనం, సెగిగ్రేషన్ షెడ్డు, వైకుంఠధామం, మొక్కల పెంపకం, పారిశుధ్యం, తదితర పనులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించేలా ఉపాధిహామీ పనులు చేపట్టాలని సూచించారు. ఎంపీడీవో సాయిరాం, ఏపీవో తుల రామకృష్ణ, ఎంపీవో సురేశ్ పాల్గొన్నారు.