సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అన్నది ఉపశీర్షిక. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.దర్శకుడు మాట్లాడుతూ ‘ఆర్థిక నేరాల నేపథ్యంలో యథార్థ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిస్తున్నాం. సత్యదేవ్ పాత్ర విభిన్న పంథాలో ఉంటుంది. ఇదివరకు ఎప్పుడు రానటువంటి సరికొత్త కాన్సెప్ట్ ఇది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సత్య పోన్మార్, సంగీతం: రవి బస్రూర్, నిర్మాతలు: ఎన్ఎన్ రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం, రచన-దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్.