Ravindranath Reddy | షర్మిలకు తెలివి ఉందో.. లేదో తెలియడం లేదని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. పుట్టింటి వారిపై షర్మిల యుద్ధానికి సిద్ధం అంటోందని విమర్శించారు. ఆమె తెలంగాణలో పార్టీ పెడితే తాము మద్దతిచ్చామని తెలిపారు. కానీ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీకి వచ్చిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ తరఫున చంద్రబాబు డైరెక్షన్లో షర్మిల పనిచేస్తుందని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఎన్ని శక్తులు అడ్డొచ్చినా అవినాశ్ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. జగన్ చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేకనే దుష్ట శక్తులన్నీ ఏకమయ్యాయని ఎద్దేవా చేశారు.