ఖమ్మం : తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్నట్లు వైఎస్ షర్మిల గతంలోనే చెప్పారు. ఏప్రిల్ 9న లక్షమందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీ ప్రకటిస్తానని ఆమె వెల్లడించారు.
ఈ నేపథ్యంలో షర్మిల బహిరంగ సభకు బుధవారం వేదిక ఖరారైంది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్ మైదానంలో బహిరంగ సభ జరుగనుంది.
ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఈ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సభకు అనుమతి లభిస్తుందా.? అన్న సందేహానికి సైతం తెరపడింది.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు.
ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనున్నట్లు షర్మిల ప్రకటించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పులివెందుల ఎలాగో.. తనకు పాలేరు నియోజకవర్గం అలాంటిదే అని ఆమె చెప్పారు. తెలంగాణలో తన పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని షర్మిల అంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.