ముంబై: యెజ్డీ బైకులు మళ్లీ వస్తున్నాయి. దేశీయ మార్కెట్లోకి మూడు మోడళ్ళను తెస్తున్నది. ఢిల్లీ ఎక్స్షోరూం ప్రకారం ధరలు రూ.1.98 లక్షల నుంచి రూ.2.09 లక్షల మధ్యలో నిర్ణయించింది. 334 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైకులు దేశవ్యాప్తంగా క్లాసిక్ లెజెండ్స్కు ఉన్న డీలర్ల వద్ద లభించనున్నాయి. రూ.5 వేలు ముందస్తుగా చెల్లించి ఈ బైకులను బుకింగ్ చేసుకోవచ్చునని తెలిపింది.