సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘యశోద’. దర్శకులుగా పరిచయమవుతున్నారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ సినిమా కోసం కళా దర్శకుడు అశోక్ నిర్దేశకత్వంలో మూడుకోట్ల రూపాయల వ్యయంతో సెట్స్ వేశారు. ఇందులో చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘స్టార్హోటల్ను ప్రతిబింబించేలా ఏడెనిమిది సెట్స్ వేశాం. సినిమాలోని కీలక ఘట్టాల షూటింగ్ ఈ సెట్స్లోనే జరుపుతున్నాం. ఇందులో సమంత, వరలక్ష్మీ శరత్కుమార్, ఉన్ని ముకుందన్ తదితరులు పాల్గొంటున్నారు. పతాక సన్నివేశాల్ని కొడైకెనాల్లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఏప్రిల్ నెలాఖరుతో షూటింగ్ పూర్తవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను విడుదల చేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎం.సుకుమార్, సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ, డా॥ చల్లా భాగ్యలక్ష్మి, సహనిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి, నిర్మాణ సంస్థ: శ్రీదేవి మూవీస్.