న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లోకి సరికొత్త ‘వైజెడ్ఎఫ్-ఆర్ 15ఎస్ వీ3’ బైకు అందుబాటులోకి తీసుకొచ్చింది యమహా మోటర్. ఢిల్లీ షోరూంలో ఈ బైకు ధరను రూ.1.57 లక్షలుగా నిర్ణయించింది. ఇతర నగరాల్లో ధరలు మారనున్నాయి. 155 సీసీ సామర్థ్యం కలిగిన ఈ బైకు గరిష్ఠంగా 18.6 పీఎస్ శక్తినివ్వనున్నదని, ఫ్యూయల్ ఇంజెక్టడ్ మోటర్, ఆరు గేర్లు ఉన్నాయి. గడిచిన నాలుగేండ్లలో 2.75 లక్షల యూనిట్ల బైకులను దేశీయంగా విక్రయించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.