సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ): యాదాద్రి ఆలయం రాష్ట్రానికే తలమానికమని టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై.సతీశ్రెడ్డి అన్నారు. ఆదివారం టీఆర్ఎస్ సోషల్ మీడియా బృందంతో కలిసి యాదాద్రిలో పర్యటించారు. స్వామి వారి దర్శనం అనంతరం గుడి ప్రాంగణంలోని నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సతీశ్రెడ్డి మాట్లాడుతూ భద్రాద్రి కట్టిన గొప్ప భక్తుడు శ్రీరామదాసు అయితే…యాదాద్రి కట్టిన నవయుగ భక్తుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ఆయన భక్తి, పట్టుదల వల్లే యాదాద్రి నిర్మాణం సాధ్యమైందని కొనియాడారు.