యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పునర్నిర్మాణ పనులు అందమైన తోరణాలు, అత్యద్భుతంగా దీపాలతో తీర్చి దిద్దుతున్నారు. ప్రతి కట్టడం పంచరాత్ర గమశాస్ర్తానుసారంగా నిర్మాణాలు సాగుతున్నాయి. యాదాద్రి ప్రధానాలయం ప్రహ రీకి ప్రత్యేకంగా రూపొందించిన బ్యాలెట్ లైట్లను బిగించారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ద్వారక కంపెనీలో ఇనుము బీడుతో ప్రత్యేకంగా తయారు చేయించారు. అర్ధ చంద్రకారంలో ఉండి పైభాగం స్వామి వారి శంఖుచక్రంతో చూడముచ్చటగా బ్యాలెట్ లైట్లను ఉన్నాయి. ఆలయం చుట్టూ ప్రహరీకి దాదాపు 160బ్యాలెట్ లైట్ల బిగించే పనులు చేపట్టగా లడ్డూ ప్రసాద కాంప్లెక్స్పై బిగించనున్నారు.
యాదాద్రి అనుబంధ శివాలయంలోని రథశాలను అద్భుతంగా రూపొందిస్తున్నారు. పై భాగంలోని సాలాహారాలలో శివపార్వతుల విగ్రహాలను అమర్చారు. రథశాల ఉత్తర దిశలో పైబర్తో నిర్మించిన త్రిశూల ఆకృతులు భక్తులను ఎంతగానో ఆకట్టుకోనుంది.