యాదాద్రి: పంచ నారసింహుడిగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఆది వారం సెలవుదినం కావడంతో స్వయంభువులకు దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో యాదాద్రి సందడిగా మారింది. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించాలని గంటల కొద్దీ క్యూ కట్టారు.
రద్దీతోపాటు ఆలయ పునర్నిర్నాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో వాహనాలకు కొండపైకి అనుమతించ లేదు. స్వామివారి పాదాల నుంచి పాతగోశాల వద్దకు వాహనాలను మళ్లించారు. స్వామి వారి ఆర్జిత పూజల కోలాహలం తెల్ల వారు జాము నాలుగు గంటల నుంచి మొదలైంది.
నారసింహుడికి నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకించి, సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించి సుదర్శన నార సింహ హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు.
ప్రతీ రోజు నిర్వహించే నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపారు. కల్యాణమూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండపం లో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణతంతు నిర్వహించారు.
ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహిం చారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరునికి రుద్రాభిషేకం జరిపారు. నవ గ్రహాలకు తైలాభిషేకం జరిపారు.
అమ్మవారికి కుం కుమార్చనలు నిర్వహించారు. కొండకింద పాతగోశాల వద్ద గల వ్రత మండపంలో జరిగిన సత్యనారాయ ణ స్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొని వ్రతమాచరించారు. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నిత్య పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి.