గోండా (యూపీ): భారత రెజ్లర్ నిషా దహియా (65 కేజీలు) రెజ్లింగ్ చాంపియన్షిప్లో స్వర్ణంతో మెరిసింది. గోండా వేదికగా జాతీయ మహిళల రెజ్లింగ్ చాంపియన్షిప్లో గురువారం జరిగిన 65 కేజీల విభాగంలో నిషా.. జస్ప్రీత్ కౌర్ (పంజాబ్)పై అలవోక విజయం సాధించింది. ప్రత్యర్థిని కేవలం 30 సెకండ్లలోనే చిత్తు చేసి స్వర్ణం సొంతం చేసుకుంది. రైల్వేస్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న 23 ఏండ్ల నిషాకు జాతీయస్థాయిలో వరుసగా రెండో స్వర్ణం కావడం విశేషం. మరోవైపు మహిళల 76 కేజీల విభాగంలో గుర్చరణ్ప్రీత్ తన ఖాతాలో ఏడో స్వర్ణాన్ని వేసుకుంది.