న్యూఢిల్లీ, జనవరి 29: కొవిడ్-19 సంక్షోభంతో పని విధానంలో వచ్చిన అనూహ్యమైన మార్పులు కొనసాగాలనే అత్యధిక శాతం ఉద్యోగులు కోరుకుంటు న్నారు. ఆఫీసుకు వెళ్లి పనిచేసేకంటే వర్క్ ఫ్రం హోం విధానంపైనే 82 శాతం ఉద్యోగులు మొగ్గు చూపిస్తున్నట్లు జాబ్సైట్ ఎస్సికే నిర్వహించిన అధ్యయనం ద్వారా వెల్లడయ్యింది. పాండమిక్ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో అమల్లోకి వచ్చిన ఇంటి నుంచి పని విధానం ఇప్పుడు సాధారణమైపోయిందని, దీంతో కొత్త ఆలోచనలు ఏర్పడ్డాయని ఎస్సికే వివరించింది. సర్వేలు, సోషల్ మీడియా అభిప్రాయాలు, ఇంటర్వ్యూలు, ప్యానెల్ చర్చల ఆధారంగా నాలుగు ఖండాల్లో 100కి పైగా సీ-సూట్, హెచ్ఆర్ లీడర్ల నుంచి పొందిన విశ్లేషణలతో ఈ టాలెంట్ టెక్ అవుట్లుక్ 2022 అధ్యయనాన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది.