న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు నీతూ (48 కిలోలు), మనీషా (57 కి) జోరు కొనసాగిస్తున్నారు. ప్రిక్వార్టర్స్లో ప్రత్యర్థులను చిత్తు చేసిన వీరిద్దరూ క్వార్టర్స్లోకి ప్రవేశించా రు. ఇస్తాంబుల్ వేదికగా శనివారం జరిగిన 48 కిలోల రెండో రౌండ్లో నీతూ 5-0తో మార్ట లోపెజ్ డెల్అర్బోల్ (స్పెయిన్)ను ఓడించగా.. 57 కిలోల బౌట్లో మనీషా 4-1తో సెట్లానా స్టానెవ (బల్గేరియా)పై అలవోకగా గెలిచింది. అలువా బల్కిబెకోవా (కజకిస్థాన్), నమున్ మంఖోర్ (మంగోలియా)తో నీతూ, మనీషా క్వార్టర్స్లో అమీతుమీ తేల్చుకోనున్నారు.