న్యూఢిల్లీ: మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్షిప్లో రెండుసార్లు ఆసియా చాంపియన్ పూజారాణి (81 కిలోలు) క్వార్టర్స్లోకి ప్రవేశించగా.. టోక్యో ఒలింపిక్స్ పతక విజేత లవ్లీనా బర్గోహై (70 కి) నిరాశపర్చింది. ఇస్తాంబుల్ వేదికగా శుక్రవారం జరిగిన 81 కిలోల ప్రిక్వార్టర్స్లో పూజారాణి 5-0తో టైమియా నాగి (హంగేరి)పై తిరుగులేని విజయం సాధించింది. సోమవారం జరుగనున్న క్వార్టర్స్లో జెస్సికా బాగ్లేతో పూజారాణి తలపడనుంది. ఒలింపిక్స్ జోష్తో ఈ టోర్నీలోకి అడుగుపెట్టిన లవ్లీనా రెండో రౌండ్లోనే పోరాటం ముగించింది. 1-4తో సిండీ నంబా చేతిలో చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.