హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలో మహిళా తొలి వర్సిటీ ప్రారంభానికి అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. కోఠి మహిళా కళాశాల ప్రాంగణంలో జీ+9 అంతస్తుల్లో వర్సిటీ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. క్లాస్రూం కాంప్లెక్స్, హాస్టల్స్తో కూడిన సమీకృత భవనాలను వీలైనంత త్వరగా చేపట్టాలని భావిస్తున్నారు. ప్రభుత్వం కోఠి మహిళా కళాశాలను అప్గ్రేడ్చేసి ‘తెలంగాణ వుమెన్ వర్సిటీ’గా నామకరణం చేసింది. బడ్జెట్లో వర్సిటీ ఏర్పాటుకు రూ.100 కోట్లను కేటాయించింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో సమావేశాలు నిర్వహించి వర్సిటీ ప్రారంభించేందుకు వీలుగా ఓ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతానికి కోఠి మహిళా కాలేజీలో యూ జీ, పీజీ కలుపుకొంటే మొత్తంగా 72 కోర్సుల ను నిర్వహిస్తున్నారు. ఈ కోర్సుల్లో 4,500 పై చిలుకు విద్యార్థులు చదువుకొంటున్నారు. 20 22-23 నుంచి వర్సిటీగా మారనున్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ ల ర్నింగ్, డాటాసైన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వం టి ఇంజినీరింగ్ కోర్సులను ప్రారంభించాలని, ఇవే కాకుండా సోషియాలజీ, న్యూట్రిషన్ అం డ్ డైటిషియన్, కెమిస్ట్రీ వంటి కాంబినేషన్లతో కూడిన కోర్సులను నిర్వహించాలని అధికారు లు భావిస్తున్నారు. దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక కోర్సులకు రూపకల్పన చేస్తున్నారు. బీఈడీ కోర్సును సైతం ప్రవేశపెట్టనున్నారు.