న్యూఢిల్లీ : బహిరంగ ప్రదేశాల్లో సోషల్ మీడియా రీల్స్ చేయవద్దని అధికారులు వారిస్తున్నా మెట్రో ట్రైన్స్ లోపల, రైల్వే ప్లాట్ఫాంలు సహా ఇతర బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు డ్యాన్స్లు చేస్తూ ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్న ట్రెండ్ కొనసాగుతోంది. జనాలతో కిక్కిరిసిన రైలు కోచ్లో ఓ యువతి ప్రముఖ భోజ్పురి సాంగ్కు డ్యాన్స్ చేస్తున్న వీడియో (Viral Video) ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.
ప్రముఖ డ్యాన్సర్, కంటెంట్ క్రియేటర్ జయ జెర్రీ ఈ వీడియో చేసింది. ఈమెకు సోషల్ మీడియాలో దాదాపు 17 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఈ వీడియోలో ఆమె గ్రే టాప్, బ్లాక్ జీన్స్ ధరించి కేసరి లాల్ యాదవ్ సజ్ కే సవార్ కే సాంగ్కు ట్రైన్ కంపార్ట్మెంట్లో స్టన్నింగ్ డ్యాన్స్ మూమెంట్స్తో ఆకట్టుకుంది. వీడియో చివరిలో ఆమె ఫ్రెండ్ కూడా సాంగ్ హుక్ స్టెప్కు పెర్ఫామ్ చేయడం కనిపిస్తుంది.
భోజ్పురి లవర్స్..ఇది ఎలా ఉందో చెప్పండి అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ ఏకంగా 70 లక్షల వ్యూస్ లభించాయి. ఆమె కాన్ఫిడెన్స్ను పలువురు ప్రశంసించగా ట్రైన్లో డ్యాన్స్ చేయడం ఏంటని పలువురు యూజర్లు నిలదీశారు. ట్రైన్లో న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు రైల్వే అధికారులు ఆమెపై చర్యలు చేపట్టాలని ఓ యూజర్ కామెంట్ చేశారు.
Read More :