ముంబై : కన్నకూతురితో వ్యభిచారం చేయించేందుకు మైనర్ బాలికను రూ 50,000కు బేరం పెట్టిన కసాయి తల్లిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ముంబైలో వెలుగుచూసింది. మైనర్ బాలికను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారని ఎన్జీవో ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి బాలికను కాపాడారు. మల్వానీ ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా మహిళతో సహా మరో దళారీని అరెస్ట్ చేశారు.
కస్టమర్ మాదిరిగా వ్యభిచార గృహ నిర్వాహకులను వాట్సాప్ నెంబర్ ద్వారా పోలీసులు సంప్రదించగా మైనర్ బాలికను రూ 50,000కు, మరో మహిళను రూ 1500కు పంపుతామని వారు బేరం కుదుర్చుకున్నారు. వీరిద్దరినీ ఇద్దరు దళారీలు మల్వానీ ప్రాంతానికి తీసుకురాగా దళారీలను అరెస్ట్ చేసిన పోలీసులు మైనర్ బాలికను కాపాడి రెస్క్యూ హోంకు తరలించారు. ఈ రాకెట్లో కీలకమైన మహిళ తన మైనర్ కుమార్తెను ఈ రొంపిలోకి దింపేందుకు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు.