కొల్చారం, డిసెంబర్ 15: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన కొల్చారం పొలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. ఎస్సై శ్రీనివాస్గౌడ్ కథనం ప్రకారం.. మండలంలోని చిన్నఘనపూర్ గ్రామానికి చెందిన బైండ్ల గౌరీగౌరమ్మ (47) మృతదేహం చిన్నఘనపూర్ నుంచి జోగిపేట వెళ్లే రోడ్డు పక్కన గురువారం తెల్లవారుజామున జాగింగ్కు వెళ్లే వారు చూసి సర్పంచ్ భర్త సందీప్కు సమాచారం ఇచ్చారు. ఆయన పోలీసులకు తెలిపారు.
ఎస్సై శ్రీనివాస్గౌడ్ ఘటనా స్థలానికి తన సిబ్బందితో వెళ్లి పరిసర ప్రాంతాల్లో పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా దవాఖానకు తరలించారు. ఘటనా స్థలంలో మద్యం బాటిల్, కల్లు ప్యాకెట్లు, వాటర్ బాటిల్ లభించడంతో ఎవరో హత్య చేశారన్న అనుమానాలు ఉన్నట్లు మృతురాలు సోదరులు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.