న్యూయార్క్ : కూతురు సాధించిన ఘనతతో కన్నతల్లి మురిసిపోయింది. కండ్ల ముందు ఎదిగిన కూతరు డాక్టరేట్ డిగ్రీ సాధించడంతో ఆనందంతో ఉప్పొంగిన తల్లి రూ . లక్ష వెచ్చించి భారీ హోర్డింగ్ ఏర్పాటు చేసింది. కూతురును అభినందిస్తూ ఆమె ఘనతను సిటీ మొత్తం తెలిసేలా హోర్డింగ్ను ఏర్పాటు చేసింది న్యూజెర్సీకి చెందిన మహిళ.
బిల్బోర్డును అద్దెకు తీసుకున్న మహిళ కెండ్ర బస్బీ (52) దానిపై తన కూతురి ఫోటోను ముద్రించి డాక్టరేట్ డిగ్రీ పొందినందుకు అభినందనలు తెలిపింది. కాండెన్కు సమీపంలోని ఎయిర్పోర్ట్ సర్కిల్కు దగ్గరగా ఏర్పాటు చేసిన ఈ బిల్డ్ బోర్డుకు ఆమె రూ 99,306 ఖర్చు చేసింది. మహిళ కూతురు క్రిస్టిన్ ఫిలడెల్ఫియా కాలేజ్ ఆఫ్ ఓస్టియోపాధిక్ మెడిసిన్ నుంచి సైకాలజీలో డాక్టరేట్ పొందింది.
ఇక బస్బీ తన కూతురు క్రిస్టిన్ డాక్టరేట్ సాధించడంపై అభినందనలు తెలుపుతూ ఫేస్బుక్లోనూ ఓ పోస్ట్ షేర్ చేసింది. నువ్వుప్పుడూ నాకు మెరిసే నక్షత్రానివే..నీవెక్కడున్నా ఎలాంటి పరిస్ధితులోనైనా మెరుస్తుంటావు..నిన్ను చూసి తల్లిగా గర్విస్తున్నా..లవ్ యూ డాక్టర్ క్రిస్టిన్ అంటూ ఆ పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చింది.