విజయ్ శంకర్, బిగ్ బాస్ ఫేమ్ అషూ రెడ్డి జంటగా నటిస్తున్న సినిమా ‘ఫోకస్’. సుహాసినీ, భానుచందర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్గా దర్శకుడు సూర్యతేజ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఇటీవల ఈ చిత్ర పోస్టర్ ను విడుదల చేశారు. త్వరలో టీజర్ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపారు. ఈ సందర్భంగా హీరో విజయ్శంకర్ మాట్లాడుతూ…‘నేను పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నాను. సుహాసినీ జడ్జిగా కనిపించనున్నారు. కథ, కథనాలు మర్డర్ మిస్టరీ మలుపులతో సాగుతూ ఆకట్టుకుంటాయి’ అన్నారు. జీవా, షాయాజీ షిండే, భరత్ రెడ్డి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : జె ప్రభాకర్ రెడ్డి, సంగీతం : వినోద్ యాజమాన్య.