న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: కరోనా మహమ్మారి అంతమైపోయినట్టు ఇప్పుడే భావించవద్దని డబ్ల్యూహెచ్వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని వేరియంట్లు రావొచ్చన్నారు. వైరస్ జన్యుపరివర్తన చెందుతున్న విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైరస్ నుంచి రక్షణకు అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని అన్నారు.