న్యూఢిల్లీ, నవంబర్ 18: పౌర విమానయాన రంగంలో ఆసియాలోనే అతిపెద్ద ప్రదర్శన అయిన ‘వింగ్స్ ఇండియా 2022’ను హైదరాబాద్లో నిర్వహించనున్నారు. 2022 మార్చి 24 నుంచి 27 వరకూ ఈ ప్రదర్శన జరుగుతుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు గురువారం తెలిపారు. ఇందుకు సంబంధించిన ముందస్తు సదస్సును కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్యా సింథియా గురువారం నాడిక్కడ ప్రారంభించారు. ఇందులో మంత్రి మాట్లాడుతూ.. వచ్చే ఐదు నుంచి ఏడేండ్లలో దేశంలో 220 విమానాశ్రయాలు ఉంటాయన్నారు. ఏడేండ్ల క్రితం ఈ సంఖ్య 74కాగా, ఇప్పుడవి 136కు చేరాయన్నారు. విమాన ప్రయాణీకుల ట్రాఫిక్ ప్రస్తుతం కొవిడ్ ముందస్తుస్థాయిలో 85 శాతానికి చేరిందని, సరుకు రవాణా 80 శాతం మేర రికవరీ అయ్యిందని సింథియా వివరించారు.