లక్నో: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామంటూ బెదిరింపు మెసేజ్ వచ్చింది. లక్నో పోలీస్ హెల్ఫ్లైన్ నెంబర్కు ఆ మెసేజ్ వచ్చినట్లు తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యూపీ సీఎంపై బాంబు దాడి చేయనున్నట్లు లక్నో పోలీస్ కంట్రోల్ రూమ్లోని హెల్ప్లైన్ వాట్సాప్ నెంబర్కు ఆగస్టు 2వ తేదీన మెసేజ్ వచ్చినట్లు గుర్తించారు. ఆ సందేశం వచ్చిన వెంటనే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ మెసేజ్ ఆధారంగా హెల్ప్లైన్ ఆపరేషన్ కమాండర్ కేసును ఫైల్ చేశాడు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించి, అతన్ని అరెస్టు చేసేందుకు గాలింపు ప్రారంభించారు. సుషాంత్ గోల్ఫ్ సిటీ పోలీసు స్టేషన్లో కేసును రిజిస్టర్ చేశారు.