అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల దారుణంగా వ్యవహరిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఉద్యోగులను ఉగ్రవాదుల్లో అరెస్టులు చేయడం విచారకరమని అన్నారు.విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం నియంతృత్వం వీడి రివర్స్ పీఆర్సీని వెనక్కి తీసుకోవాలన్నారు. అహంకారంతో కాకుండా ఆలోచనతో స్పందించాలని సూచించారు.
టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేశ్ మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల ఏపీ సీఎం జగన్ ఎందుకింత క్రూరంగా వ్యవహిస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలపడం నేరం ఎలా అవుతుందని, రాజ్యాంగం ప్రసాదించిన హక్కును హరించే అధికారం మీకెవరిచ్చారని ప్రశ్నించారు. గురువులను పోలీసులతో నిర్బధించడమేనా మీరిచ్చే గౌరవమని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలనే కదా ఉద్యోగులు అడుగుతున్నారని తెలిపారు. ఉద్యోగుల ఉద్యమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని వెల్లడించారు.