హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ప్రపంచ వ్యాప్తంగా అంతరించిపోతున్న వివిధ రకాల వన్యప్రాణులను రక్షించుకోవాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హరిప్రీత్సింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీహెచ్ఆర్డీ)లో అపెక్స్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైని ంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ, వరల్డ్ వైల్డ్ లై ఫ్ ఫెడరేషన్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) సహకారంతో గురువారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో హర్ప్రీత్సింగ్ మాట్లాడుతూ, అత్యంత ప్రమాదం లో ఉన్న జాతులు, వాటి ఆవాసాలు, పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణకు కృషిచేయాలని సూచించారు. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్ ఇండి యా హైదరాబాద్ స్టేట్ డైరెక్టర్ ఫరిదా తంపాల్ మాట్లాడుతూ, అటవీశాఖతో కలిసి తెలంగాణ, ఏపీలో వన్యప్రాణి సంరక్షణకు కృషి చేస్తున్నామని తెలిపారు. సీనియర్ ప్రాజెక్టు అధికారి డాక్టర్ అశోక్కుమార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పులుల పరిరక్షణ, ఇతర వన్యప్రాణులు, వృక్ష సంపదను పర్యవేక్షించే పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో శిక్షణలో ఉన్న దాదాపు 260 మంది ఆలిండియా సర్వీస్ ఆఫీసర్లు, సెంట్రల్ సివిల్ సర్వీసెస్, మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ (ఎంఈఎస్) అధికారులు పాల్గొన్నారు.