తిరుపతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. ఆదివారం తిరుపతిలో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో మాట్లాడారు. ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న అంశాలు కేవలం ఆ రెండు రాష్ట్రాలకు చెందినవి కావని, ఇవి జాతీయ అంశాలని వెల్లడించారు. సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు.
అంతకు ముందు మాట్లాడిన ఏపీ సీఎం జగన్ ఏపీ డిస్కంలకు కేంద్రం ఆదుకోవాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నిరెండుగా విభజించడం వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని వివరించారు. రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా విభజన హామీలు అమలు కావడంలేదని, రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.