చెన్నై, మార్చి 24: కేంద్ర నిధుల విడుదల విషయంలో తమిళనాడు పట్ల వివక్ష చూపుతున్నదంటూ మోదీ సర్కార్పై డీఎంకే నాయకుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్న ప్రతి రూపాయిలో కేవలం 28 పైసలు మాత్రమే రాష్ర్టానికి తిరిగి వస్తున్నాయని అన్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీని.. మనమంతా ‘28 పైసల పీఎం’గా పిలవాలంటూ తమిళనాడు ప్రజల్ని ఆయన కోరారు. థేనీ, రామనాథపురంలో పార్టీ ర్యాలీలో పాల్గొన్న ఆయన, మోదీ సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోదీ తమిళనాడుకు వస్తున్నారంటూ విమర్శించారు. ‘రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులను కేంద్రం అడ్డుకుంటున్నది. ఎయిమ్స్ మదురై నిర్మాణ పనులే ఇందుకు ఉదాహరణ’ అని ధ్వజమెత్తారు.