క్రీడల్లో రాణించే వారిని ప్రోత్సహిస్తామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫల్మండికి చెందిన సంగిని హర్షవర్ధన్ 100 మీటర్ల స్ప్రింట్ పోటీల్లో రాణించి, ఆసియా యూత్ స్పోర్ట్స్లో బంగారు పతకం సాధించారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మంగళవారం ఆయనను తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. కార్యక్రమంలో జలంధర్ రెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.