రెబ్బెన : మండలంలోని గోలేటి గ్రామ పంచాయతీకి చెందిన వార్డు సభ్యులు ( Ward members ) బీఆర్ఎస్( BRS) పార్టీలో చేరారు. గోలేటి గ్రామ సర్పంచ్ ఆజ్మీర బాబూరావు ఆధ్వర్యంలో వార్డు సభ్యులు జుమ్మిడి అరుణ్, మిడిగొండ లక్ష్మి లింగమూర్తి ఆదివారం ఎమ్మెల్యే కోవలక్ష్మి ( MLA Kova Laxmi ) సమక్షంలో పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎ స్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, బీఆర్ఎస్ రెబ్బెన మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి, గుండి సర్పంచ్ జబరి రవీందర్, రాజంపేట ఉపసర్పంచ్ మామిడి లక్ష్మి, మాజీ సర్పంచ్ తోట లక్ష్మణ్, నాయకులు నిసార్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.