మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
హన్మకొండ, మార్చి 20: పట్టభద్రులు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్రెడ్డి, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా సురభి వాణీదేవి ఘన విజయం సాధించిన సందర్భంగా హన్మకొండలో జరిగిన సంబురాల్లో మంత్రి పాల్గొన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్రావు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జన్ను జకార్యతో కలిసి పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఈ విజయం ప్రజలందరిదన్నారు. ఈ విషయంతో రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్దేనని మరోసారి రుజువైందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జై తెలంగాణ నినాదాల నడుమ నృత్యాలు చేస్తూ సంబురాల్లో మునిగితేలారు.