వరంగల్, మార్చి 28 :కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా,కార్మిక వ్యతిరేఖ విధానాలపై కార్మికలోకం పిడికిలెత్తింది.సోమవారం దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆల్ ట్రెడ్ యూనియన్స్ అద్వర్యంలో ధర్నా, కేంద్ర ప్రభుత్వ దిష్టబోమ్మను దహనం చేశారు. ఎంజీఎం సెంటర్లో మహా ధర్నా నిర్వహించిన కార్మికులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబోమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లా రమేశ్ మా ట్లాడుతూ కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తు న్నారని మండి పడ్డారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీ యూసీ, ఐఎఫ్టీ యూ నాయకులు బోగి సురేశ్, గాదె కుమార్, గడల రమేశ్, జీవన్ కుమార్, శ్రీనివాస్, కుమ్మరి ఆశోక్, మైదం నరేశ్, ఎల్లయ్య, ఆశోక్తో పాటు మున్సిపల్, ఎంజీఎం కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
బల్దియా ముందు ధర్నా
దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా గ్రేటర్ కార్పో రేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వ అవలంభిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేఖ విధానాలకు వ్యతిరేఖంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సింగారపు బాబు జన్ను ప్రకాశ్, గోర్రె సారయ్య, సుమన్, రాజేశ్, కుమార్, భిక్షపతి, కిశవోర్,మాదవ్, శ్రీధర్, అరున్, నవీన్, రవి తదితరులు పాల్గొన్నారు.
పర్యతగిరిలో..
పర్వతగిరి, మార్చి 28: కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతి రేక విధానాలను నిరసిస్తూ సోమవారం బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిం చి, నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సీఐటీ యూ మండల కన్వీనర్ జిల్లా రమేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ టీచర్స్ హెల్పర్ యూనియన్ జిల్లా నాయకురాలు బొంపెల్లి రుక్మిణీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మాదాసి యాకూబ్ ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. 29 సమ్మెను విజయవంతం చే యాలని కోరారు. ఈ కార్య క్రమంలో సీఐటీయూ మం డల కన్వీనర్ జిల్లా రమేశ్, నా యకులు బొంపెల్లి రుక్మిణి, మాదాసి యాకూబ్, పోడేటి ద యాకర్, పద్మ, స్వరూప, వనిత, సునీత, కల్పన, శాంతమ్మ, సుమిత్ర, రజిత, మంగమ్మ, రాజు, ఎండీ యాఖూబ్, నకిరకంటి రామ్చందర్, కరుణాకర్ కార్మికులు పాల్గొన్నారు.
దేశవ్యాప్త సమ్మెకు భవన నిర్మాణ కార్మికుల మద్దతు
చెన్నారావుపేట: దేశవ్యాప్త సమ్మెకు చెన్నారావుపేట మం డల భవన నిర్మాణ కార్మికులు సోమవారం మద్దతు పలికారు. భవన నిర్మాణ కార్మికులు స్వచ్ఛందంగా ముందకు వచ్చి సమ్మెలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మండల కేంద్రంలో నర్సంపేట-నెక్కొండ ప్రధాన రహదారిలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యమ్రంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు బండి ఉపేందర్, కార్మికులు అల్లాడి వెంకటనారాయణ, నాగేంద్రచారి, కాట్ల రాములు, నాంపెల్లి రాజు, వేములపల్లి కుమారస్వామి, కుమారస్వామి, శీలం శంకర్, బండి శ్రీను, సాంబయ్య పొల్గొన్నారు.