హనుమకొండ, మార్చి 27 : రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నా రు. హనుమకొండ హంటర్రోడ్డులోని వరంగల్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా జాబ్మేళాను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జాబ్మేళా ఏర్పాటుకు సహకరించిన వరంగల్ పబ్లిక్ స్కూల్ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ప్రిన్సిపాల్ ఉమారాణి, డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేళాకు 50కిపైగా కంపెనీలు వచ్చాయన్నారు. సుమారు 2500 మందికి వరకు రిజిస్ట్రేషన్ చేయించుకుని 1600 మంది ఇంటర్యూలకు హాజరైనట్లు తెలిపారు. 400 మందికి పైగా వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని ఆయన గుర్తుచేశారు. తాజాగా మరో 87 వేల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటించారన్నారు. ఉగాది తర్వాత గ్రూప్-1, 2, ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవ, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు యువతకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రయిట్ రంగంలో కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగావకాశాలు యువతకు దకేలా టాస్క్ సెంటర్ను ఏర్పాటు చేసి మూడు లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో లక్షల ఉద్యోగాలు కల్పిస్తూనే కోట్లాది మందికి జీవనాధారమైన వ్యవసాయ రంగాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషిషచేస్తున్నారని చెప్పారు.
యువతను నట్టేట ముంచిన చరిత్ర బీజేపీది..
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలోని నిరుద్యోగ యువతం ఏ చేసిందో సమాధానం చెప్పాలని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ డిమాండ్ చేశారు. లక్షలాది ఐటీ ఉద్యోగాలకు గండి కొట్టిందని, యువతను నమ్మించి నట్టేట ముంచిన ద్రోహ చరిత్ర బీజేపీదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్ ఐపాస్ విధానాన్ని తీసుకొచ్చి రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి 16 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. బీజేపీ పాలనలో నిరుద్యోగ రేటు 8.1 శాతం అని, కేంద్రం అసమర్థతతోనే నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. ఉద్యోగ ఖాళీలపై కేంద్రం శ్వేతప్రతం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కుడా చైర్మెన్ సంగంరెడ్డి సుందర్రాజు, మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఏసీపీ జితేందర్రెడ్డి, కార్పొరేటర్లు దాస్యం అభినవ్భాస్కర్, సోదా కిరణ్, పాఠశాల ప్రిన్సిపాల్ ఉమారాణి, జ్యోతీనాయుడు, ఫస్ట్ ఫేస్ ప్రతినిధి మహేశ్, కంపెనీల హెచ్ఆర్లు, ప్రతినిధులు, అభ్యర్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.