వనపర్తి: పోడు భూముల సమస్యలకు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష అధ్యక్షతన అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి నిరం జన్రెడ్డి హాజరై మాట్లాడుతూ అటవీ భూమిని సాగుచేసుకుని జీవనం సాగిస్తున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు.
వనపర్తి జిల్లాలో ఉన్న అటవీ భూముల పరిరక్షణకు ప్రతి ఒక్కరం పాటు పడుతూనే దీనిపై జీవనం సాగిస్తున్న ప్రజలకు పట్టాలు ఇచ్చేందుకు కృషి చేద్దామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన హరితహారం మొక్కలు నాటే కార్యక్రమం మూలంగా 4 శాతం అటవీ విస్తీర్ణం పెరిగిందని మరో 6 శాతం పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు.
పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రతి గ్రామంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి వారు ఇచ్చిన నివేధిక ఆదారంగా రెవిన్యూ, ఫారెస్ట్ శాఖల సంయుక్త సర్వేతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. దీనికి అన్ని రాజకీయ పక్షాలు సహాకరించాలన్నారు.
ప్రజాహితం కోరుతూ ప్రజలే ప్రాతిపదికగ పారదర్శకంగా పోడు భూముల పట్టాలకు సలహాలు ఇవ్వాలని అన్నారు. త్వర లో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయ్యనుందని దీని ఆదారంగా పట్టాలు అందజేస్తామన్నారు. వనపర్తి జిల్లాలో 28వేల343 ఎకరాల అటవీ విస్తీర్ణం ఉందని అన్నారు.
జిల్లాలో మొత్తం 24 అటవీ బ్లాక్లు ఉన్నాయని, 6 మండలాల్లో 36 గ్రామాలల్లో అటవీ అక్రమణలు ఉన్నాయన్నారు. అక్రమణకు గురైన అటవీ భూమి విస్తీర్ణం 2378 ఎకరాలు ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 8 నుంచి డిసెంబ ర్ 8 వరకు క్లెయిమ్స్ తీసుకుంటుందన్నారు. అటవీ భూములు ఒక అంగులం కూడా అక్రమణకు గురికాకుండా చూడా ల్సిన బాధ్యత రాజకీయ పార్టీలు, ప్రజలపై ఉందన్నారు.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అటవీ భూములను పరిరక్షించేందుకు అవసరమైతే పోలీస్శాఖ సహాయం తీసుకుంటుంద న్నారు. అటవీ భూములను ఎవరైనా అక్రమి స్తే పీడీ యాక్ట్లను నమోదు చేస్తామని అన్నారు. సర్వే సమయంలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తీయాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథరెడ్డి, అదనపు కలెక్టర్లు అశిష్ సంగ్వన్, వేణుగోపాల్, చీప్ కంజర్వేటర్ శృతిఓజా, తహాసీల్దార్ రాజేందర్గౌడ్, ఫారెస్ట్ ఆఫీసర్ రామకృష్ణ, జడ్పీటీసీలు భార్గవి, వెంకటేశ్వరమ్మ, రాజేంద్రప్రసాద్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటీ శ్రీదర్, జెడ్పీ కో-ఆప్షన్ సభ్యులు మునీరుద్దిన్, వక్ఫ్ బోర్డు సభ్యులు హర్షద్, జహాంగీర్ , వివిద పార్టీల నాయకులు తదితరులు పోల్గొన్నారు.