బెంగళూరు: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్గా హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ సోమవారం బాధ్యతలు చేపట్టాడు. బెంగళూరులోని ఎన్సీఏ ప్రధాన కార్యాలయంలో లక్ష్మణ్..విధుల్లో చేరాడు. ఈ సందర్భంగా ట్విట్టర్లో వీవీఎస్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘ఎన్సీఏలో తొలి రోజు. కొత్త సవాల్ కోసం ఆసక్తిగా ఉన్నాను. భారత క్రికెట్ భవిష్యత్ కోసం పనిచేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను’ అని ట్వీట్ చేశాడు. జాతీయ జట్టు చీఫ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఖాళీ అయిన ఎన్సీఏ హెడ్ పదవిని లక్ష్మణ్తో భర్తీ చేశారు. ఇంతకుముందు గత కొన్ని సీజన్లుగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్గా, బెంగాల్ క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ సలహాదారుగా లక్ష్మణ్ పనిచేశాడు. అయితే ఎన్సీఏ బాధ్యతల కోసం వీటి నుంచి వీవీఎస్ తప్పుకున్నాడు.