కూతురు తీసుకొచ్చిన యాప్ను ఆవిష్కరించనున్న రజినీ
చెన్నై, అక్టోబర్ 24: దేశంలోనే తొలి వాయిస్బేస్డ్ సోషల్మీడియా వేదిక ‘హూటే’ యాప్ను ప్రముఖ నటుడు రజినీకాంత్ కూతురు సౌందర్య అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ యాప్ను సోమవారం ఆవిష్కరించనున్నట్టు రజినీకాంత్ తెలిపారు. 2020 ఏడాదికి గానూ కేంద్రం ప్రకటించిన దాదాసాహెబ్ పాల్కే అవార్డును కూడా ఇదేరోజున అందుకోనుండటం మర్చిపోలేని విషయమన్నారు.