న్యూఢిల్లీ : వివో ఎక్స్80 సిరీస్కు కొనసాగింపుగా వివో ఎక్స్90 సిరీస్ను భారత్లో లాంఛ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు ముమ్మరం చేసింది. చైనాలో ఇప్పటికే అందుబాటులో ఉన్న న్యూ సిరీస్ బీఐఎస్ వెబ్సైట్లో కనిపించడంతో త్వరలో వివో లేటెస్ట్ స్మార్ట్ఫోన్ దేశీ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది.
మెరుగైన కెమెరా ఫీచర్లతో వివో ఎక్స్90 సిరీస్ కస్టమర్లను ఆకట్టుకోనుంది. చైనా వేరియంట్ తరహాలో భారత్ వేరియంట్ స్పెసిఫికేషన్స్ కూడా ఉంటాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. చైనాలో ఎక్స్90 బేసిక్ మోడల్ భారత కరెన్సీలో రూ .42,400 కాగా, వివో ఎక్స్90 ప్రొ 8జీబీ+256జీబీ వేరియంట్ రూ . 57,200 పలుకుతోంది.
వివో లేటెస్ట్ స్మార్ట్ఫోన్ 6.78 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమన్సిటీ 9200 చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానుంది. వివో ఎక్స్ 90 వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్తో ముందు భాగంలో 32 ఎంపీ స్నాపర్తో ఆకట్టుకోనుంది. 120డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో వివో ఎక్స్90 4810ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది.