హైదరాబాద్ : ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని చేవెళ్ల, గుంటూరు ఎంపీలు రంజిత్రెడ్డి, గల్లా జయదేవ్, పలువురు ఎంపీలతో కూడిన పార్లమెంట్ ఐటీ స్టాండింగ్ కమిటీ హైదరాబాద్లో పర్యటించింది. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్, టీ హబ్, స్టేట్ డేటా సెంటర్ తదితర సంస్థలను సందర్శించింది. దేశంలోనే అతి పెద్ద ఇంక్యూబేటర్ టీ హబ్ను, పనితీరును కమిటీ పరిశీలించింది. అలాగే స్టేట్ డేటా సెంటర్ను సందర్శించింది. బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో భారత టెలికం సేవలను పరిశీలించింది.
ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో కమిటీ సమావేశమైంది. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సమాచార, ఎలక్ట్రానిక్స్.. కమ్యూనికేషన్ల శాఖ ముఖ్య కార్య దర్శి జయేశ్ రంజన్ తెలంగాణ ప్రభుత్వం తరఫున స్టాండింగ్ కమిటీకి స్వాగతం పలికారు. టీ హబ్పై కమిటీకి వివరించారు. పార్లమెంటరీ స్టాండింగ్ ఐటీ కమిటీ ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శ్రీనగర్, ముంబై, హైదారాబాద్, చెన్నై నగరాల్లో పర్యటించనుంది. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఐటీ పనితీరును పరిశీలిస్తూ, అధ్యయనం చేస్తున్నది.