అహ్మదాబాద్: గుజరాత్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వనాథ్సింగ్ వాఘేలా తన పదవికి ఆదివారం రాజీనామా చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనకు ముందు రోజు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే విశ్వనాథ్సింగ్ వాఘేలా ఏ పార్టీలో చేరుతారో అన్నది ఇంకా స్పష్టం కాలేదు. కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ నెల 5న ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో ఆయన పాల్గొంటారు. అలాగే సెప్టెంబర్ 5న అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ఫ్రంట్లో బూత్ స్థాయి కార్యకర్తల ‘పరివర్తన్ సంకల్ప్’ సదస్సులో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు.
మరోవైపు గుజరాత్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వనాథ్సింగ్ వాఘేలా రాజీనామాపై ఆ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రుత్విజ్ పటేల్ స్పందించారు. ‘రాహుల్ గాంధీ రేపు(సోమవారం) గుజరాత్కు వస్తున్నారు. ‘కాంగ్రెస్లో చేరండి’ అనే ప్రచారాన్ని చేపట్టనున్నారు. అయితే గుజరాత్లో ‘క్విట్ కాంగ్రెస్ ప్రచారం’ కొనసాగుతోంది’ అని విమర్శించారు.