హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : కళాతపస్వి, పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కే విశ్వనాథ్ మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు. విశ్వనాథ్ రూపొందించిన సినిమాలు తెలుగు సినీ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోతాయని తమిళిసై చెప్పారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి దేశం గర్వించదగ్గ దర్శకుడు కే విశ్వనాథ్ అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కీర్తించారు. విశ్వనాథ్ సినిమాలు తెలుగు సినీ పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయని, ఓ సినీ శిఖరం ఒరిగిపోవడం బాధాకరమని మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అచ్చమైన తెలుగుదనాన్ని, సంసృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అద్భుతమైన సినిమాలు అందించిన విశ్వనాథ్ కానరాని లోకాలకు వెళ్లడం తనను కలచివేసిందని మంత్రి హరీశ్రావు తెలిపారు. విశ్వనాథ్ అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకొని తెలుగుదనాన్ని అణువణువునా ప్రతిబింబించేలా సినిమాలు చేశారని మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, వేముల ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ అన్నారు. కళాత్మక చిత్రాలను కమర్షియల్గా విజయవంతం చేయడం విశ్వనాథ్కే సాధ్యమైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గుర్తు చేశారు.
ఎన్నో సందేశాత్మక చిత్రాలను రూ పొందించి తెలుగు ప్రజల సంస్కృతి, సం ప్రదాయాలను కాపాడేందుకు ఎనలేని సేవలందించిన గొప్ప దర్శకుడు విశ్వనాథ్ అని హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రు లు సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఇంద్రకరణ్రెడ్డి శ్లాఘించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత విశ్వనాథ్ తెలుగు ప్రజలకు ఎన్నో మరుపురాని చిత్రాలను అందించారని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. విశ్వనాథ్ మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నా రు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఏపీ సీఎం జగన్, మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు, రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ కుమార్, టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు సంతాపం తెలిపారు.