విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓరి దేవుడా’. అశ్వత్ మారిముత్తు దర్శకుడు. పీవీపీ సినిమా, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాలపై దిల్రాజు సమర్పణలో తెరకెక్కుతున్నది. మిథిలా పాల్కర్, ఆశాభట్ కథానాయికలు. మంగళవారం ఈ సినిమా టైటిల్ పోస్టర్ను విడుదల చేశారు. చర్చి ప్రాంగణంలో ఎగురుతున్న సీతాకోకచిలుకను పట్టుకోవడానికి హీరో విశ్వక్సేన్ ప్రయత్నిస్తుంటే కథానాయిక అతన్ని వెనక్కి లాగుతున్న ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకునేలా ఉంది. ‘రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ప్రేమ, పెళ్లి, వినోదం అంశాల కలబోతగా అలరిస్తుంది. విశ్వక్సేన్ పాత్ర చిత్రణ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: విదు అయ్యన్న, సంగీతం: లియోన్ జేమ్స్, మాటలు: తరుణ్భాస్కర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వంశీ కాక, రచన-దర్శకత్వం: అశ్వత్ మారిముత్తు.