ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. సినీ తారలతో పాటు వివిధ రంగాల ప్రముఖులు ఈ మహాయజ్జంలో పాల్గొని పచ్చదనాన్ని పెంపొందించేలా ప్రజల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. సోమవారం తమిళ హీరోలు విశాల్, ఆర్య, కథానాయిక మృణాళిని గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో మొక్కలునాటారు.
ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ ‘అడవులను సంరక్షిస్తూ పచ్చదనాన్ని పెంపొందించినప్పుడే సమాజం బాగుంటుంది. ఈ బాధ్యతను స్వీకరిస్తూ గ్రీన్ ఇండియాచాలెంజ్ లాంటి మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించడం ఆనందంగా ఉంది. గ్లోబల్ వార్మింగ్ను అరికట్టడానికి ఉపయోగపడే ఈ చాలెంజ్లో మేము పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. నేను నాటిన మొక్కకు ఇటీవల కన్నుమూసిన నా స్నేహితుడు పునీత్ రాజ్కుమార్ పేరుపెడుతున్నా. ఈ మొక్కను జీవితాంతం కాపాడుతాను’ అని పేర్కొన్నారు. కాలుష్యరహిత పర్యావరణం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆర్య పిలుపునిచ్చారు. దివంగత పునీత్ రాజ్కుమార్ జ్ఞాపకార్థం ఆయన పేరుమీద మొక్కలు నాటడం విశాల్ మంచి మనసుకు నిదర్శనమని ఎంపీ సంతోష్కుమార్ కొనియాడారు.