చెన్నై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు చెన్నైలో ట్రైనింగ్ క్యాంప్ను ప్రారంభించనుంది. ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్రైనింగ్ మొదలైన రెండు రోజుల తర్వాత ఏప్రిల్ 1న జట్టులో చేరనున్నాడు. ఆర్సీబీ తన సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో ఏప్రిల్ 9న అమీతుమీ తేల్చుకోనుంది. ఆర్సీబీ తమ ఆరంభ మ్యాచ్లను చెన్నైలోనే ఆడనుంది.
ఇంగ్లాండ్తో మూడో వన్డే అనంతరం కోహ్లీ సోమవారం ఫుణెలోని బయో బబుల్ నుంచి బయటకు వచ్చేశాడు. బయో సెక్యూర్ వాతావరణంలోకి అడుగుపెట్టాలంటే ఐపీఎల్ మార్గదర్శకాల ప్రకారం కోహ్లీ తప్పనిసరిగా వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ సిరీస్ నేపథ్యంలో గత జనవరి చివరి వారం నుంచి కోహ్లీ బయో సెక్యూర్ బబులోనే ఉంటున్నాడు.
కోహ్లీతో పాటు వన్డే జట్టులో ఉన్న ఆర్సీబీ ఆటగాళ్లు యుజువేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్ సోమవారం మధ్యాహ్నం పుణె నుంచి నేరుగా చెన్నై చేరుకున్నారు. మంగళవారం నుంచి వీరిద్దరూ ట్రైనింగ్కు అందుబాటులో ఉంటారు. ఐపీఎల్ మార్గదర్శకాల ప్రకారం బయో బుబల్లో ఉన్న ఆటగాళ్లు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా సాధనలో పాల్గొనే వెసులుబాటు కల్పించారు.
ఐపీఎల్ 2021: స్టన్నింగ్ లుక్లో అర్జున్ టెండూల్కర్
ఇంగ్లాండ్పై సిరీస్ విక్టరీ..రెండో ర్యాంకుకు దూసుకెళ్లిన భారత్
ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మరో ఆల్రౌండర్: వీడియో