హైదరాబాద్: భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండవ క్రికెటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. రాహుల్ ద్రావిడ్ పేరిట ఉన్న ఆ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. హైదరాబాద్లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ టీ20లో ఈ ఘనతను అందుకున్నాడు. కోహ్లీ ఇప్పటి వరకు 471 ఇంటర్నేషనల్ మ్యాచుల్లో 24078 రన్స్ చేశాడు. 53.62 సగటుతో ఆ స్కోరింగ్ చేశాడతను. అయితే ఇండియా తరపున రాహుల్ ద్రావిడ్ 24,064 రన్స్ చేశాడు. ద్రావిడ్ మార్క్ను హైదాబాద్ మ్యాచ్లో కోహ్లీ దాటేయడం విశేషం. ఇండియా తరపున అత్యధిక పరుగులు చేసిన టాప్ క్రికెటర్ జాబితాలో సచిన్ టెండూల్కూర్ టాప్లో నిలుస్తాడు. 664 మ్యాచుల్లో సచిన్ 48.52 సగటుతో 34357 రన్స్ చేశాడు. సచిన్ ఖాతాలో 100 సెంచరీలు, 164 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక కోహ్లీ ఖాతాలో 71 సెంచరీలు, 125 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సచిన్, కోహ్లీ, ద్రావిడ్ తర్వాత స్థానాల్లో గంగూలీ(18,433), ధోనీ (17,092), సెహ్వాగ్(16,892) ఉన్నారు.