దుబాయ్: మేటి ఇండియన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20ల్లో కొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక సగటు స్కోరింగ్ రేటు కలిగిన బ్యాటర్గా ఘనత సాధించాడు. బుధవారం హాంగ్కాంగ్తో జరిగిన మ్యాచ్లో అతను ఈ ఫీట్ను అందుకున్నాడు. హాంగ్కాంత్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ 44 బంతుల్లో 59 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. అయితే విరాట్ ఇప్పటి వరకు 101 టీ20 మ్యాచ్లు ఆడాడు. దాంట్లో అతను 3402 రన్స్ స్కోర్ చేశాడు. అతని యావరేజ్ 50.77గా ఉంది. టీ20 ఫార్మాట్లో 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోర్ 94 రన్స్. ఇక స్ట్రయిక్ రేటు 137.12గా ఉంది.
పాకిస్థాన్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ 57 మ్యాచుల్లో 50.14 సగటుతో స్కోరింగ్ చేశాడు. ఇక అత్యధిక సగటు రన్ రేట్ కలిగిన బ్యాటర్లలో ఆ తర్వాత జాబితాలో డేవన్ కాన్వే, బాబర్ ఆజామ్, మనీశ్ పాండేలు ఉన్నారు. కాన్వే 23 మ్యాచుల్లో 47.20 యావరేజ్తో స్కోరింగ్ చేశారు. బాబర్ ఆజమ్ 75 మ్యాచుల్లో 44.93 యావరేజ్తో స్కోర్ చేశాడు. మనీశ్ పాండే యావరేజ్ 39 మ్యాచుల్లో 44.31గా ఉంది.