Virat Kohli 76th Ton | వెస్టిండీస్తో (India Vs West indies) రెండో టెస్టు మ్యాచ్లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (206 బంతుల్లో 121; 11 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కడంతో టీమ్ఇండియా భారీ స్కోరు చేసింది. ఫలితంగా భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 438 పరుగులకు ఆలౌటైంది. అంతర్జాతీయ స్థాయిలో కోహ్లీకి ఇది 500వ మ్యాచ్ కాగా.. 500వ ఇంటర్నేషనల్ మ్యాచ్లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇక మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లీకి ఇది 76వ (Kohli 76th Ton) సెంచరీ కాగా.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) వంద శతకాలతో అగ్రస్థానంలో ఉన్నాడు.
అయితే 500వ ఇంటర్నేషనల్ మ్యాచ్ (Virat 500 International Matches)లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన సందర్భంగా.. కోహ్లీ భార్య అనుష్క శర్మ (Anushka Sharma) తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ప్రత్యేక పోస్టు పెట్టింది. విరాట్ సెంచరీ చేసి అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఫోటో తీసి పోస్టు చేసింది. దీనికి లవ్ సింబల్ను జత చేసింది. మరోవైపు సచిన్ కూడా ఈ సెంచరీపై స్పందించాడు. ఇన్స్టాలో కోహ్లీ స్టోరీ షేర్ చేసిన సచిన్.. ‘మరో రోజు మరో సెంచరీ చేసిన కోహ్లీ. అద్భుతంగా ఆడావు’ అని స్టోరీస్లో రాసుకోచ్చాడు. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు వైరల్గా మారాయి.
ఇక వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటలో భారత్ తొలి ఇన్నింగ్స్లో 438 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్.. ఆట ముగిసే సమయానికి 1 వికెట్ కోల్పోయి 86 పరుగులు చేసింది. 9 వికెట్లు చేతిలో ఉండగా.. విండీస్ ఇంకా 352 పరుగులు వెనుకబడి ఉంది.