హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli )మరో మైలురాయి దాటనున్నాడు. వెస్టిండిస్తో జరగనున్న సిరీస్లో మరో ఆరు పరుగులు జోడిస్తే సొంతగడ్డపై వన్డేల్లో ఐదు వేల పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా నిలవనున్నాడు. ఇంతకు ముందు సచిన్ మాత్రమే ఈ ఫీట్ సాధించాడు. అయితే సచిన్ ఈ మేలురాయిని చేరుకోవడానికి 121 ఇన్నింగ్సులు ఆడాడు.
అయితే వెస్టిండీస్తో ఆదివారం ప్రారంభం కానున్న తొలి వన్డేలో కోహ్లీ 6 రన్స్ చేస్తే.. 96 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించవచ్చు. సచిన్ కూడా వెస్టిండీస్పైనే ఈ రికార్డును అందుకోవడం విశేషం. కాగా, భారత్కు వన్డే ఫార్మాట్లో భారత్కు ఇది 1000వ మ్యాచ్ కావడం విశేషం. ఇప్పటి వరకు ఏ ఒక్క జట్టు కూడా 50 ఓవర్ల ఫార్మాట్లో వెయ్యి మ్యాచ్లు ఆడలేదు.
మూడు ఫార్మట్లలో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీ.. ఇక తన బ్యాటింగ్పై దృష్టి సారించనున్నాడు. పేలవమైన ఫామ్లో ఉన్న ఈ సిరీస్తోనైనా తన మునుపటి ప్రదర్శనను చూపించాలని, పరుగుల వరద పారించాలని అభిమానులు కోరుకుంటున్నారు.